నోముల భగత్ చేత ప్రమాణస్వీకారం చేయించిన స్పీకర్ పోచారం

  • సాగర్ ఉపఎన్నికలో జానారెడ్డిపై గెలుపొందిన భగత్
  • అసెంబ్లీ రూల్స్ బుక్, ఐడీ కార్డు అందించిన మంత్రి వేముల
  • కార్యక్రమానికి హాజరైన పలువురు మంత్రులు
నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆయన చేత ఎమ్మెల్యేగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. భగత్ కు అసెంబ్లీ రూల్స్ బుక్, ఐడెంటిటీ కార్డును శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై నోముల భగత్ గెలుపొందారు.

Nomula Bhagath
Oath
TRS

More Telugu News